ఏజెన్సీ మండలాలలో బంద్ ప్రశాంతం

60చూసినవారు
కొమురంభీం జిల్లా జైనూర్ ఘటనను ఖండిస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ మండలాలయిన అసిఫాబాద్, లింగాపూర్, సిర్పూర్ యూ, జైనూర్, కెరమెరి, వాంకిడి, తిర్యాని, మండలాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కూరగాయల మార్కెట్, అన్ని రకాల వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్