జైనూర్ అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్

56చూసినవారు
జైనూర్ అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ వ్యవసాయాధికారి పవన్ కుమార్ పై సస్పెన్షన్ వేటుపడింది. జైనూర్ మండలంలోని ఓ గ్రామపంచాయతీ పరిధిలో ఓ రైతు మృతి చెంది ఏళ్ళు గడిచినా బాధిత కుటుంబానికి రైతు బీమా అందకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏఓ పవన్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు ఆసిఫాబాద్ ఏడీఏ వెంకటి గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్