కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి అటవిశాఖ చెక్ పోస్ట్ నుంచి అంకుసాపూర్, నర్లపూర్, నందిగాం, కోమటిగూడ, కామాన, వాంకిడి గ్రామాలకు వెళ్లే రహదారిని సాయంత్రం 6 దాటితే ఫారెస్ట్ అధికారులు బంద్ చేస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు అనుమతి ఇవ్వడం లేదు. అంకుసాపూర్-వాంకిడి రహదారి వైపు పులుల ట్రాకింగ్ ఎక్కువగా ఉందని. అందువల్ల ఆంక్షలు విధిస్తున్నట్లు కాగజ్నగర్ ఎఫ్ఆర్వో రమాదేవి తెలిపారు.