కాగజ్నగర్ పట్టణం వార్డు నెంబర్ 1 లో శుక్రవారం ఉదయం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీజీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణ సుందరీకరణ చేపడతామని హామీ ఇచ్చారు.