కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని శ్రీరామ మందిరాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీ దండే విఠల్ ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాణా ప్రతాప్ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.