కాగజ్నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయంలో పవిత్ర ఆషాఢ మాసంను పురస్కరించుకుని శ్రీమహాకాళి అమ్మవారు, శ్రీ శీతలమాత అమ్మవారు గర్భాలయంలో కొలువైన శ్రీ పార్వతిదేవి మాతలకు శాకాంబరి ఉత్సవమును నిర్వహించారు. శివమల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించి తదుపరి ముగ్గురు అమ్మలకు అభిషేకములు, కూరగాయలతో అమ్మవార్లకు ప్రత్యేకాలంకరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పండితులు తీర్థప్రసాదములు అందజేసారు.