ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఈనెల 6న విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.