ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు యూపీ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ప్రకటించారు. ఘటనలో గాయపడిన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు.