మహారాష్ట్రలోని పుణె శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన ఆరుగురు యువకులు అజ్మేర్ దర్గా సందర్శనకు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా పుణె శివారులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్, ఫిరోజ్ కురేషి, మజీద్ పటేల్ గా గుర్తించారు. సయ్యద్ అమర్ యువకుడు పుణె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.