బిహార్లో 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పట్నా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోటాను 50శాతం నుంచి 65శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పట్నా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో నితీశ్కుమార్ నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీశ్ సింగ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.