ములకలపల్లి శివారులోని ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాన్ని 22న వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ చైర్మన్ నరాటి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి భక్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.