భద్రాచలం: లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

81చూసినవారు
భద్రాచలం: లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత
భద్రాచలం పట్టణ శివారులో వాహన తనిఖీల్లో 3. 50 లక్షల విలువైన 12. 5 కిలోల గంజాయి మంగళవారం పట్టుకున్నట్లు ఆబ్కారీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై రావడంతో ఆపి తనిఖీ చేయగా వారి వాహనంలో గంజాయి లభ్యమైంది. ఒడిశాలో కొనుగోలు చేసి హైదరాబాద్ తరలిస్తున్నట్లు విచారణలో వారు వెల్లడించారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్