మేడే సంబురాలు జయప్రదం చేయండి

73చూసినవారు
మేడే సంబురాలు జయప్రదం చేయండి
మేడే 138వ సంబరాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం దుమ్ముగూడెం మండలం సీతారాంపురంలో  సిపిఐ, , ఏఐటియూసి సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ మే 1న కార్మిక వర్గాలు సంఘటితంగా కార్మికుల హక్కుల దినోత్సవం వాడవాడలా ఎర్రజెండాలు ఎగరవేసి శ్రమజీవుల ఐక్యతను చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్