భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శానిటేషన్ పనులు స్థంభించాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం నుండి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ప్రస్తుతం ఆసుపత్రి గేటు వద్ద నిరసన కొనసాగుతుంది. దీంతో శానిటేషన్ పనులు స్థంభించాయి.