భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 45. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా అశ్వరావుపేట 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎండల పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.