ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం: జిల్లా కలెక్టర్

51చూసినవారు
ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం: జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొన్నారు. దాహం వేసేంత వరకు వేచి చూడడం మంచి సూచిక కాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్