సమ సమాజ స్థాపనకై అహర్నిశలూ కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి బాపు ఫూలే అని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపు ఫూలే 197వ జయంతి సందర్భంగా గురువారం పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచలోని ఫూలే చిత్రపటానికి కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.