
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టల్ శాఖ ప్రత్యేక క్యాంపులు
AP: 18 ఏళ్లు దాటిన వారి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల అనుసంధానం కోసం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టల్ శాఖ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త బ్యాంకు ఖాతా తెరవడం, వాడుకలో లేని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్కు లేఖ రాశారు.