పాల్వంచలో మంచి నీటి సమస్య పరిష్కరించాలి: నిమ్మల రాంబాబు

82చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ కార్యాలయంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా మండలంలో మంచినీటి సమస్య పరిష్కరించ లేకపోయారని, మంచినీటి ఎద్దడితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్