ఇల్లందు ఎమ్మెల్యే తండ్రికి నివాళులర్పించిన కూనంనేని
ఇల్లందు శాసన సభ సభ్యులు కోరం కనకయ్య తండ్రి కోరం పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం అంత్యక్రియల్లో పాల్గొని వారికి నివాళులు అర్పించారు. కోరం కనకయ్యకు, కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.