మనస్థాపం చెంది మహిళ ఆత్మహత్య
ములకలపల్లి మండలం మామిళగూడెం గ్రామానికి చెందిన అడమకు పిల్లలు పుట్టి మృతి చెందుతుండటంతో మనస్తాపానికి గురై సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. అడమ, లక్మాలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు జన్మించి చనిపోయారు. పిల్లలు పుట్టి తరచూ మరణిస్తుండటంతో మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజమౌళి తెలిపారు.