సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

78చూసినవారు
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
సీఎం రేవంత్ రెడ్డి తన నలుగురు బ్రదర్స్ కోసం, వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన దసరా సమ్మెళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఫార్మాసిటీ రద్దు అయిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందంటున్నారు. ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్