మతోన్మాద పార్టీని రానీవ్వం: భట్టి

63చూసినవారు
మతోన్మాద పార్టీని రానీవ్వం: భట్టి
తెలంగాణలోకి మతోన్మాద పార్టీయైన బీజేపీని రానివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో భట్టి మాట్లాడుతూ.. 'పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. ఇండియా కూటమిగా బీజేపీపై కలసికట్టుగా పోరాడుతాం. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలి అని చెప్పారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీని రాష్ట్రంలో గెలవనీయకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ తో జతకట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్