మేడారం మహా జాతరకు తరలివచ్చిన భక్తులు తిరుగుపయనం అయ్యారు. 4 రోజుల జాతరలో భాగంగా నిన్నటితో జాతర ముగియగా.. భక్తులు తమ ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 75% మేడారం ఖాళీ అయింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ సాయంత్రం వరకు మేడారం మరింత ఖాళీ అయ్యే అవకాశం ఉంది.