మరుగుదొడ్డిలోనే జీవనం

64చూసినవారు
మరుగుదొడ్డిలోనే జీవనం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన 51 ఏళ్ల పెరుగు లింగయ్య. కుష్ఠు వ్యాధి బాధితుడైన ఆయన పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించగా.. ఏకైక కుమారుడు వారి అమ్మమ్మ వద్ద పెరిగి అక్కడే ఉంటున్నారు. దీంతో ఒంటరిగా ఉంటున్న లింగయ్య.. పూరి గుడిసె కూలిపోవడంతో ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకున్నారు. నాలుగు అడుగుల ఆ గదిలో వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ జీవనం గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్