ఢిల్లీలోని ఆంధ్రభవన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడి ఆంధ్ర క్యాంటీన్లో కేసీ వేణుగోపాల్ తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లనూ ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. దేశంలోని సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్గా ఉంటాయని ఆయన తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకీ రానుందని తెలిపారు.