యూపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని సోదరిని హత్య చేశారు ఇద్దరు సోదరులు. ఆ యువతిని గొంతు నులిమి హత్య చేసి ఆపై శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మే 30న అత్రౌలీ పోలీస్ స్టేషన్కు చెందిన పవయాన్ నుండి గహదౌ వెళ్లే రోడ్డులో సగం కాలిన బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లక్నోలోని కాయస్థాన కాకోరి నివాసి ప్యారే లాల్ కుమార్తె సంగీతగా గుర్తించారు. దర్యాప్తులో బాగంగా దుర్గేష్ సైనీ, అతని సోదరుడు శంకర్ అలియాస్ రవిలను అరెస్ట్ చేశారు.