కరీంనగర్ జిల్లా శంకరపట్నం(M) ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత.. పొరుగింటి వ్యక్తి రత్నాకర్ ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. మమత ఇంటి ఎదుట నుంచి రత్నాకర్ ఇంటికి వెళ్లాలి. దీంతో మమత తల్లిదండ్రులు రోడ్డుపై అడ్డంగా గోడ కట్టారు. దీనిపై ఎవరు చెప్పినా వారు వినకపోవడంతో మమత తల్లిదండ్రులపై మమత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.