ఆపరేషన్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

4684చూసినవారు
ఆపరేషన్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరోసారి అరుదైన సర్జరీ చేశారు. బల్మూరు మండలం పోలిశెట్టిపల్లికి చెందిన రేణుక అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న దాదాపు మూడు కిలోల కణితిని తొలగించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఎమ్మెల్యే చొరవ పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్