కొండారెడ్డిపల్లిలో ఉద్రిక్తత

64చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వార్తల సేకరణ కోసం కొండారెడ్డిపల్లికి వెళ్లిన ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. తమపై దాడి చేశారని, కెమెరాలను పగలగొట్టారని యూట్యూబ్ ఛానల్ విలేఖరులు ఆరోపించారు. సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని యూట్యూబ్ రిపోర్టర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్