నామినేషన్ కార్యక్రమానికి తరలిన బీజేపీ నేతలు

539చూసినవారు
నామినేషన్ కార్యక్రమానికి తరలిన బీజేపీ నేతలు
మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి గురువారం కౌకుంట్ల బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు సంఘాల రవీందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు తరలివెళ్లారని అన్నారు. ఎంపీగా డీకే అరుణ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్