సివిల్స్ టాపర్ అనన్య రెడ్డికి సత్కరించిన సీఎం

544చూసినవారు
సివిల్స్ ఫలితాలలో మెరిసిన దోనూరు అనన్య రెడ్డి ని రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం సత్కరించి అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పోనకల్లు గ్రామానికి చెందిన దోనూరు అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగలి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్