విద్యార్థులకు పాఠ్య పుస్తకాల రాక

51చూసినవారు
విద్యార్థులకు పాఠ్య పుస్తకాల రాక
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఒకటి నుంచి పదో తరగతికి సంబంధించిన పుస్తకాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖ పుస్తక విభాగం ఇన్ఛార్జి అమరిష్ తెలిపారు. వచ్చిన వాటిని జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నామన్నారు. ఇప్పటివరకు 40శాతం మేర పుస్తకాలు వచ్చాయని పాఠశాలలు తెరిచే నాటికి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్