జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ఇలవేల్పు దైవం జమ్మిచేడు శ్రీజములమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారిని మొక్కులు, దర్శించుకుని చెల్లించుకునేందుకు హైదరాబాదు, ఎమ్మిగనూరు, రాయచూరు, గద్వాల, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ వాహనాలలో తరలివచ్చారు. భక్తులతో జమ్మిచెడు ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడగా పోలీసులు క్రమబద్ధీకరించారు.