కేంద్ర పథకాలతోనే దేశాభివృద్ధి

69చూసినవారు
కేంద్ర పథకాలతోనే దేశాభివృద్ధి
కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతోందని బిజెపి పార్టీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం బిజెపి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తెలియజేశారు. ప్రజలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలలో కేంద్రం పాత్ర ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్