జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని భరత్ నగర్ లో ఓల్టేజ్ సమస్య, కొత్త బస్టాండ్ సమీపంలో విద్యుత్ వైర్లు సరిచేసేందుకు సోమవారం మధ్యాహ్నం 3: 00 గంటల నుండి సాయంత్రం 5: 00 గంటల పవర్ కట్ ఉంటుందని ఏడీఈ నీలి గోవిందు తెలిపారు. ప్రధానంగా భరత్ నగర్, కొత్త బస్టాండ్, దేవ నగర్, టీచర్స్ కాలనీ, తెలంగాణ చౌరస్తా, గాజులపేట, వెంకట రమణ కాలనీ, ఎస్సీ కాలనీలలో పవర్ కట్ ఉంటుందని వినియోగదారులు గ్రహించి సహకరించాలని కోరారు.