రామచంద్రారెడ్డికి రెడ్ క్రాస్ అవార్డు ప్రదానం

55చూసినవారు
రామచంద్రారెడ్డికి రెడ్ క్రాస్ అవార్డు ప్రదానం
ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రాజ్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శుక్రవారం అవార్డుల ప్రదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాల ద్వారా 900యూనిట్లకు పైగా రక్తం సేకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డికి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ అజయ్ మిశ్రా చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ తాహేర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్