రైల్వే స్టేషన్ లో అడ్డగోలు దోపిడీ..!

55చూసినవారు
రైల్వే స్టేషన్ లో అడ్డగోలు దోపిడీ..!
జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్ లో ద్విచక్ర వాహనాలు పార్క్ చేస్తే చాలు ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పార్కింగ్ నిర్వాహకులు అడిగినంతా ఇవ్వాల్సిందే. నిర్దేశించిన రుసుముల కంటే అదనంగా వాహనాలు నిలిపినందుకు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ ఫీజులలో పారదర్శకత కోసం బోర్డు ఏర్పాటు చేసిన అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతినిత్యం దోపిడీకి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్