అడుగంటిన కృష్ణానది.. కనిపించని చుక్క నీరు

8053చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి క్షేత్రానికి ఆనుకొని ఉన్న కృష్ణానది ప్రస్తుతం పూర్తిగా అడుగంటి పోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది పరవళ్లతో సోయగాలు పోయే ఈ కృష్ణానది ప్రస్తుతం రాళ్లు తేలి కళావిహీనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు బీచుపల్లి క్షేత్రాన్ని దర్శించి అక్కడ పితృకార్యాలు చేసేందుకు వస్తుంటారు. కృష్ణా నదిలో చుక్క నీరు లేకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్