పీయులో అలరించిన కవి సమ్మేళనం

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా విద్యార్థులకు కవితల పోటీలను నిర్వహించామని తెలుగు విభాగాధిపతి డా. ఎన్. సంద్య రాణి అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డా. కృష్ణయ్య, డా. భూమయ్య, డా. సుభాషిణిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తెలుగు భాషపై మక్కువను పెంచేందుకే కవిత పోటీలను నిర్వహించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్