బావోజీ జాతర ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

80చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ జాతరను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బావోజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర జరగనుంది. లంబాడీల ఆరాధ్యమైన గురు లోకమసంద్ ను ఈ వేడుకల్లో పూజించనున్నారు. బావోజీ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి బంజారాలు అధిక సంఖ్యలో వస్తారు.

సంబంధిత పోస్ట్