రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: మాజీ మంత్రి

1071చూసినవారు
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: మాజీ మంత్రి
జడ్చర్ల పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాలని నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు. ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల నష్ట పరిహారం,తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్