నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలి: ఎస్ఎఫ్ఎ

1091చూసినవారు
కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఎ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు భారత్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేటి పరీక్ష పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ చేతగాని చర్య అని అన్నారు. లీకేజీకి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్