తాగునీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండాలి: శృతి ఓజా

82చూసినవారు
తాగునీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండాలి: శృతి ఓజా
వేసవి దృష్ట్యా మహబూబ్ నగర్ జిల్లాలో తాగు నీటికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ప్రత్యేక అధికారిని శృతి ఓజా ఆదేశించారు. తాగు నీటి సమస్య పరిష్కారానికై ప్రభుత్వం ఇటీవలె ఆమెను ప్రత్యేక అధికారిగా నియమించింది. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె జిల్లా కలెక్టర్ రవినాయక్ తో కలిసి అన్నిశాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్