ఇసుక టిప్పర్ పట్టివేత

580చూసినవారు
ఇసుక టిప్పర్ పట్టివేత
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అభిషేక్ రెడ్డి వివరాలు.. మండలంలోని పత్తేపూర్ గేటు నుంచి రుద్రారం వైపు వస్తున్న ఇసుక టిప్పర్ ను గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని ఆపి విచారించారు. అనుమతి పత్రాలు చూపించమని పోలీసులు కోరడంతో డ్రైవర్ పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు డ్రైవర్ తో పాటు, వాహనాన్ని స్టేషన్ కు తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్