మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

580చూసినవారు
మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రానికి గుమ్మకొండ అనిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవి నాయకులు రాజు, ఆదినారాయణ, మ్యాకల శివకుమార్, పోలె రాజు, రమేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్