కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండల పరిధిలోని కొలుకుల పల్లి గ్రామంలో సోమవారం ఉదయం వెంకటయ్య గౌడ్ (53) తాటికల్లు తీయడానికి అతని పొలంలో చెట్టు ఎక్కుతుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుకున్న గ్రామ ప్రజలు చెట్టు పైనుంచి అతి కష్టంతో క్రిందకు దించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.