రోడ్డు నిర్మాణం కోసం బీజేపీ నాయకుల పాదయాత్ర

54చూసినవారు
ప్రధాన రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ రేమద్దుల గ్రామ బిజెపి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. జిల్లా బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. ఏదుట్ల నుంచి సింగాయిపల్లి వరకు ప్రధాన రహదారి గుంతలమాయంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి, రాజు, సురేందర్ రెడ్డి, శ్యామ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్