నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలోని పురాతన ఫారెస్ట్ ఆఫీస్ లో శుక్రవారం మంటలు చెలరేగాయి. లోపల కట్టెలు, చెత్త ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్న పోలీస్, ఫారెస్ట్ క్వార్టర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యా రు. 100 కు డయల్ చేయడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మంటలకు కారణాలపై అధికారులు విశ్లేషిస్తున్నారు.