ఎకరానికి రూ. 10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి

69చూసినవారు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గురువారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణా రావు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని, పంట నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, తమ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్