ఏపీలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 41 మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. అందులో రాజమహేంద్రవరం కార్పొరేషన్కు చెందిన వారు 23 మంది ఉన్నారు. ఇటీవల 44వ డివిజన్లోని 76, 77 సచివాలయాల పరిధిలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 23 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆర్వోకు ఫిర్యాదు చేయడంతో.. విచారణ జరిపి వారిని తొలగించారు. అలాగే పార్వతీపురం మన్యంలో జిల్లాలో 11 మందిపై వేటు వేశారు.